తెలంగాణ రాజకీయాలు రోజురోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి.తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో నేనున్నా నంటూ వై.
ఎస్.షర్మిల పార్టీ పేరుతో ప్రకటన చేసింది.అయితే ప్రకటన అయితే చేసింది కాని వివిధ రకాల వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, వరుస కామెంట్లతో తెలంగాణ రాజాకీయాలను హీటెక్కిస్తోంది.అయితే టీఆర్ఎస్ పార్టీ షర్మిల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.
తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికావద్దని, ఆంధ్ర పాలనను వదిలించుకోవాలని ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్న తెలంగాణ ప్రజలు మరల ఆంధ్ర వాళ్ళ పాలనను ఎలా అంగీకరిస్తారని, ఈ విషయం మర్చిపోయి రాజకీయం చేయడానికి ఎలా వస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహం ఏంటని ఒక్కసారి గమనిస్తే షర్మిల తన వ్యాఖ్యలతో రోజురోజుకు రెచ్చిపోతున్న వేళ అధికార పార్టీ స్పందించకుంటే అధికార పార్టీ ప్రోద్భలం తోనే షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తుందనే వాదన తెరపైకి రాకుండా జాగ్రత్తపడడంలో భాగంగానే ఈ వ్యూహాన్ని టీఆర్ఎస్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా షర్మిల ఎన్నికల సమయానికి తనదైన పాత్ర పోషించే అవకాశం ఉంది.భావిశియత్తులో షర్మిల ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది చూడాల్సి ఉంది.