టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు.నిన్న 9 గంటల పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.
నేడు మరోసారి విచారణకు రావాలని తెలిపారు.దీనిలో భాగంగా విదేశాల్లో మంచిరెడ్డి జరిపిన లావాదేవీలపై అధికారులు ఆరా తీయనున్నారు.
అయితే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విదేశాల్లో పెట్టుబడులు, నగదు చెల్లింపులపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంచిరెడ్డి ఫారెన్ టూర్స్, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించింది.