తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకీ ఈటల రాజీనామా చేసాక ఆయన ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజక వర్గం పై గులాభి బాస్ చూపు సారించారు.కాగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నిక ఒక ఎత్తు ఐతే ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక మాత్రం ఎప్పుడు చూడని రీతిలో సాగుతుందని ఇప్పటి నుండే అంచనాలు పెంచుకుంటున్నారట.
ఒకవైపు టీఆర్ఎస్ కు, మరో వైపు ఈటలకు కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రాతిష్టాత్మకమైనది.
ఒకవేళ ఈ ఎన్నికలో ఈటల గెలిస్తే రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ఈటల వర్గీయులు భావిస్తున్నారట.
ఇకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికకు ఇప్పటి నుండే వ్యూహ రచన చేస్తుంది గులాభి దళం.ఇందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తెరాస నేతల సమావేశం అయ్యి కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది.ఇకపోతే ఈ నెల 10న నియోజక వర్గ స్థాయి సమావేశం జరగనుందని, ఇందులో మంత్రి హరీష్ రావు కూడా హాజరు కానున్నారని వార్త ప్రచారం జరుగుతుంది.