యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
గతంలో అరవింద సమేత వంటి బ్లాక్బస్టర్ మూవీని అందించిన ఈ కాంబో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా త్రివిక్రమ్ తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యడు.ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో గతంలో అరవింద సమేత చిత్రంలో నటించిన పూజా హెగ్డే అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట.
కానీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్గా మారిన బ్యూటీ రష్మిక మందన అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని, అందుకే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని తారక్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఇద్దరిలో ఎవరిని ఓకే చేయాలా అనే అంశంపై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టాడట.మరి తారక్ సరసన హీరోయిన్గా త్రివిక్రమ్ ఎవరిని ఓకే చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్పైకి తీసుకెళ్లేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.