గురూజీ ఫోకస్ అంతా ఆమెపైనే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Trivikram Focusing On Heroine, Trivikram, Ntr, Ntr30, Heroine, Tollywood News-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

గతంలో అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన ఈ కాంబో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యడు.ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో గతంలో అరవింద సమేత చిత్రంలో నటించిన పూజా హెగ్డే అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట.

కానీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన బ్యూటీ రష్మిక మందన అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని, అందుకే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని తారక్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ఇద్దరిలో ఎవరిని ఓకే చేయాలా అనే అంశంపై త్రివిక్రమ్ ఫోకస్ పెట్టాడట.మరి తారక్ సరసన హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఎవరిని ఓకే చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube