కోలీవుడ్ లో ప్రెజెంట్ సెన్సేషనల్ కాంబో ఏది అంటే ఇళయ దళపతి విజయ్ అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనే చెప్పాలి.వీరి కాంబో ప్రకటించినప్పటి అంచనాలు భారీగా పెరిగాయి.
లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా గత ఏడాది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.
ఇక కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ఈయన సినిమా అంటే అక్కడి ఫ్యాన్స్ కు ఎంత సంతోషమో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.
ఇటీవలే విజయ్ వారిసు సినిమాతో వచ్చి 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాతో మంచి విజయం సాధించడంతో విజయ్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
మరి లోకేష్ దర్శకత్వంలో ఇప్పటికే మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విజయ్ ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా పక్కా విజయం సాధిస్తుంది అని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయ్యారు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీని గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది.హీరోయిన్ విషయంలో కూడా చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది.
కానీ ఎట్టకేలకు ఈ సినిమా హీరోయిన్ గురించి అఫిషియల్ అనౌన్స్ వచ్చేసింది.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ కన్ఫర్మ్ అయ్యింది.విజయ్, త్రిష దాదాపు 14 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.
ఎప్పటి నుండో వస్తున్న రూమర్స్ ను మేకర్స్ నిజం చేయడంతో మరోసారి ఈ జోడి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.2023 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు టాక్.