తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.టీఆర్ఎస్ అవినీతిని తాము పూసుకోలేమని చెప్పారు.
నేతలను కొనుగోలు చేయడంలో తాము వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా టీఆర్ఎస్ 25, బీజేపీ 15 సీట్లకే పరిమితం అవుతాయని జోస్యం చెప్పారు.