కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రధాని మోదీ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర పెట్టుబడులను గుజరాత్ తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు.ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని తెలిపారు.2015లో తనను అన్యాయంగా జైల్లో పెట్టారన్న రేవంత్ రెడ్డి తన కుమార్తె వివాహానికి వెళ్లకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పక్క పార్టీలను పతనం చేస్తే అధికారం శాశ్వతం అనుకున్నారన్నారు.
అదే ఉసురు మీకు తగిలి మీ పార్టీ పతనమైపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.