టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు 2022 సంవత్సరాన్ని మిస్ చేసుకున్నారు.అందులో ముఖ్యం గా నందమూరి బాలకృష్ణ మరియు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.
వీరిద్దరు కూడా 2021 సంవత్సరం డిసెంబర్ నెల లో తమ సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ రెండు సినిమా లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఈ సంవత్సరం కూడా వారి నుండి సినిమా లు వస్తే కచ్చితం గా భారీ విజయా లను దక్కించుకుంటాయని అంతా భావించారు.కానీ ఈ సంవత్సరం వారి నుండి సినిమా లు రాలేదు.
బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ను ఈ సంవత్సరం చివర్లో విడుదల చేస్తాం అంటూ మొదట మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు.
కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నెల లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప కథ ఏడాది డిసెంబర్ లో వచ్చి ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప పార్ట్ 2 సినిమా ను ఇదే ఏడాది విడుదల చేయాల్సి ఉంది.
కానీ భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా అవ్వడంతో స్క్రిప్ట్ కాస్త మార్చాలని ఉద్దేశం తో ఏకంగా సంవత్సర కాలం పాటు స్క్రిప్ట్ మార్పులు చేర్పులకే సమయం కేటాయించారు.

ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి స్థాయి లో ప్రారంభం కాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.అల్లు అర్జున్ మరియు బాలకృష్ణ ఇద్దరు హీరోలు కూడా 2022 సంవత్సరాన్ని మిస్ చేసుకున్నట్లే.అయితే ఈ సంవత్సరం లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇతర హీరోల్లో మరి కొందరు సక్సెస్ దక్కించుకుని ఈ ఏడాదిని సద్వినియోగం చేసుకున్నారు
.