టాలీవుడ్ ( Tollywood )లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి( Rajamouli ) అనడం లో ఎలాంటి సందేహం లేదు.రాజమౌళి సినిమా లు మినిమంగా మూడు గంటల నిడివితో వస్తూ ఉంటాయి.
ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన దాదాపు అన్ని సినిమా లు కూడా మూడు గంటలకు పైగా నే నిడివిని కలిగి ఉన్నాయి అని నిరూపితం అయింది.ఇప్పుడు ఆయన్ను చూసి చాలా మంది దర్శకులు వాత పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
చాలా మంది తమ సినిమా లకు ఏంటి అంటూ మూడు గంటలు, అంతకు మించి నిడివి తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.ముఖ్యంగా సందీప్ వంగ( Sandeep Vanga ) దర్శకత్వం లో రణబీర్ కపూర్ హీరో గా రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా రూపొందిన యానిమల్ సినిమా( Animal movie ) ఏకంగా మూడున్నర గంటల నిడివి వచ్చిందని అంటున్నారు.మొదట రెండు భాగాలు గా ఈ సినిమా అన్నారట.కానీ ఇప్పుడు కాస్త నిడివి తగ్గించి మూడు గంటల పది నిమిషాల తో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా ను కూడా భారీ గా రూపొందించాడు.మూడు గంటలకు పైగానే నిడివి ఉంది.కానీ ఆ సినిమా ను చాలా వరకు తగ్గించాడు.
కానీ ఈ సినిమా పై ఉన్న నమ్మకం తో మూడు గంటలకు మించి ఉంచాలని నిర్ణయించుకున్నాడు.కేవలం రాజమౌళి ని చూసి సందీప్ వంగ మాత్రమే కాకుండా చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు అంటూ తాజాగా వచ్చిన సినిమా లు మరియు రాబోతున్న సినిమా లను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.మొత్తానికి రాజమౌళి కంటెంట్ ఉన్న సినిమా లు తీస్తాడు కనుక నాలుగు గంటలు ఉన్నా కూడా జనాలు చూస్తారు.
కానీ ఇతర దర్శకుల సినిమా ల్లో కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటుందా అనేది మాత్రం అనుమానమే.