స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్, కింగ్ అక్కినేని నాగార్జున ల గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు వీరిద్దరి కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బ్లాక్ స్పెషల్ హిట్గా నిలిచాయి.ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్లో ఏఏ సినిమాలు విడుదల అయ్యాయి అన్న విషయానికొస్తే.
సంతోషం, నేనున్నాను, ఊపిరి, మనం( Manam ) వంటి సినిమాలతో బాగా అలరించారు.వీరి కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.

నాగార్జున ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ శ్రియా – నాగార్జున కాంబో( Shriya Nagarjuna Combo ) చాలా మందిని ఆకట్టుకుంది.ఆ సినిమాలు కూడా ఇప్పటికీ గుర్తుండి పోయేలా నిలిచాయి.అయితే శ్రియా శరణ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రియా శరణ్ నాగార్జున గురించి ఆషక్తికరంగా కామెంట్లు చేసింది.
సౌత్ లో అద్భుతమైన నటులు ఉన్నారు.వారిలో నేను నాగార్జున( Nagarjuna )తో కలిసి పని చేశాను.
ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థమయ్యేలా నేర్పించారు.

దాని వల్ల ఇప్పటికీ నేను నా లైఫ్ లో ప్రతిరోజూ అన్ని పరిస్థితులను ఎదుర్కొగలుగుతున్నాను అని చెప్పుకొచ్చింది శ్రియా శరణ్.ఇదే తనకు లైఫ్ లో చేసిన గొప్ప సాయంగా భావించింది.ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
కాలా శ్రియా శరణ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్( Second Innings ) ని ప్రారంభించగా నాగార్జున మాత్రం ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో హీరోగా నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.







