హైదరాబాద్ లో వింత ఘటన చోటు చేసుకోనుంది.నగరంలో ఇవాళ మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు నీడ మాయం కానుంది.మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 నిమిషాల వరకు ఈ ఘటన ఆవిష్కృతం కానుంది.సూర్యుడు నిట్ట నిలువుగా పడటం వలన నీడ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందుకే దీనిని షాడో డే గా పిలుస్తారు.భూమధ్య రేఖకు 23.45 డిగ్రీల వంపుతో అక్షం కక్ష్యలో మార్పు జరగనుంది.కాగా నగర అక్షాంశం 17.3850 (ఎన్) డిగ్రీల ప్రకారం నీడను చూడలేమని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు వెల్లడించారు.ఈ మేరకు బిర్లా ప్లానిటోరియంలో షాడో డే ను ప్రదర్శించనున్నారు.







