తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేడు కీలక ఘట్టం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది.స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

 Today Is A Key Moment In Tirumala Srivari Brahmotsavam-TeluguStop.com

ఇందులో భాగంగానే నేడు గరుడ వాహన సేవ జరగనుంది.స్వామివారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనదని చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలో మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.కాగా సాయంత్రం నిర్వహించే స్వామివారి గరుడ సేవకు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

భక్తులకు గ్యాలరీల్లో తాగునీరు, అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube