ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుపతి శ్రీకాళహస్తి పర్యటన చేపట్టడం జరిగింది.ఈ పర్యటనలో ముందుగా వకుళమాత ఆలయాన్ని ప్రారంభించగా ఆ తర్వాత శ్రీకాళహస్తి సమీపంలో ఇనగలూరులో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంకి కంపెనీ అందుబాటులోకి వస్తుందని నేరుగా 15 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
ఇదే సందర్భంలో దాదాపు 80 శాతం ఉద్యోగాలకు మహిళలకు అని బంపర్ ఆఫర్ లాంటి ప్రకటన సీఎం జగన్ చేశారు.
ఇదే కంపెనీ తడ, పులివెందుల లో కూడా ఉందని అక్కడ అధికశాతం మహిళలు ఉద్యోగాలు చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.ఇక ఇదే సందర్భంలో అపాచీ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహాయం అందుతుందని తెలిపారు.
ఒక్క ఫోన్ కాల్ చాలు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు.