భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు టిఫిన్ బైఠక్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party )రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు టీఫిన్ బైఠక్ కార్యక్రమం కేంద్రంలో బుధవారం రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు టీఫిన్ బైఠక్ కార్యక్రమం( Tiffin Baithak programme ) ప్రతి నెల 16వ తేదీన నిర్వహించే కార్యక్రమం గంభీరావుపేట మండలంలో నిర్వహించారు.

రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామస్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా బూత్ కమిటీలను పటిష్టంగా చేసి వచ్చే ఎలక్షన్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధులు లగిశెట్టి శ్రీనివాస్, చక్రధర్ రెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, టిఫిన్ బయట కన్వీనర్ నవీన్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ, గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు చికోడు మరియు గూడెం సర్పంచులు తదితర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News