ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది.ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప వృత్తి.
కానీ కొందరు తమ విపరీత ప్రవర్తన వల్ల దాని గౌరవాన్ని పోగొడుతున్నారు.కొందరు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేస్తోంది.చదువుకుంటాడని బడికి పంపితే… ముగ్గురు టీచర్లు కలిసి కొట్టి చంపారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని చిబరమవు కొత్వాలి పరిధిలోని కసవ గ్రామంలో ఈ దారుణం జరిగింది.అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల కుమారుడు దిల్షాన్ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
పగలు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దిల్షాన్ ను పిలిచిన టీచర్ శివకుమార్.మరో ఇద్దరు తోటి ఉపాధ్యాయులు ప్రభాకర్, వివేక్ లను పిలిపించాడు.గది తలుపులు మూసేసి ముగ్గురు టీచర్లు ఆ పిల్లాడిని తీవ్రంగా కొట్టారు.

కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందతూ ఆ బాబు ప్రాణాలు కోల్పోయాడు.వాచీ దొంగతనం మోపి తన కుమారుడిని తీవ్రంగా కొట్టి చంపారని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టీచర్లు విచక్షణ రహితంగా కొట్టడం వల్లే గాయాలై చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం తెలుస్తుందని పోలీసులు అన్నారు.కానీ బంధువులు మాత్రం టీచర్లదే తప్పు అని.ఒక వేళ దొంగతనం చేసినా… చంపే వరకు కొడతారా అని ప్రశ్నిస్తున్నారు.