పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం సరికాదని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.తాను వైఎస్ జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు.
తాను పార్టీ మారుతానని ఎక్కడ చెప్పలేదన్నారు.ఇదంతా చంద్రబాబు ఆడుతున్న గేమ్ అని ఆరోపించారు.
కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పార్టీకి ద్రోహం చేశారని చెప్పారు.ఒకవేళ భవిష్యత్ లో కోవూరు టికెట్ వేరొకరికి ఇచ్చిన వారి గెలుపుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.