టీడీపీ నుంచి వచ్చే పనికిరాని వాళ్లకు టికెట్ ఇస్తున్నారు..: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ టికెట్లను జాగ్రత్తగా ఇవ్వాలన్నారు.

టీడీపీ నుంచి వచ్చే పనికిరాని వాళ్లకు టికెట్ ఇస్తున్నారని తెలిపారు.టీడీపీ నుంచి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ కేటాయించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.

అలా చూడకుండా టికెట్లు ఇవ్వడం వలనే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లారని చెప్పారు.సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్నారని వార్తలు వచ్చాయన్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ కాళ్లు పట్టుకోవడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారని సమాచారం.

Advertisement
యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

తాజా వార్తలు