ఇటీవలే పాన్ ఇండియా అంటూ టాలీవుడ్ స్టార్ లు అందరూ కూడా బాలీవుడ్ లో దుమ్ము దులుపుతున్నారు.అక్కడ హీరోల సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టేస్తున్నారు.
ఎవరికీ అందనంత దూరంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.ఒక్కరేమిటి పుష్ప సినిమాతో అల్లు అర్జున్, త్రిబుల్ ఆర్ సినిమా తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.
ఇక మన సౌత్ నుంచి కే జి ఎఫ్ తో యష్ అందరు హీరోలు కూడా బాలీవుడ్ లో ఒక రేంజ్ లో హవా నడిపిస్తున్నారు.
ఇలాంటి ఇలాంటి సమయంలోనే అక్కడి ప్రేక్షకులు మన హీరోలకు బ్రహ్మరథం పడుతుంటే కొంతమంది ట్రోల్ చేసేవారు కూడా లేక పోలేదు అని చెప్పాలి.
పుష్ప సినిమాలో రఫ్ లుక్ తో కనిపించిన అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మెయింటెన్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే క్రికెటర్ మలింగను గుర్తు చేశావు వడ పావ్ లా ఉన్నావు అంటూ అల్లు అర్జున్ పై నార్త్ ఆడియన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవలే మేజర్ ప్రమోషన్ సమయంలో బాలీవుడ్లో సినిమాలు చేసే ఆసక్తి లేదు అంటూ మహేష్ బాబు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారిపోయింది.ఇక ఇదే మనసులో పెట్టుకున్న అక్కడి ఆడియన్స్ బాలీవుడ్ భరించలేదు కానీ మహేష్ బాబు ను పాన్ మసాలా భరిస్తుందా అంటూ ఇటీవలే మహేష్ బాబు చేసిన పాన్ బహార్ యాడ్ మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
బాహుబలి సినిమా తర్వాత సాహో తో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రభాస్ ఇటీవలే ముంబైలో మేకప్ లేకుండా తిరుగుతున్నాడు.దీంతో ప్రభాస్ కాస్త బొద్దుగా కనిపించేసరికి ప్రభాస్ అంకుల్ లాగ ఉన్నాడు అంటు కొంతమందికి ట్రోల్ చేస్తున్నారట.ఇలా టాలీవుడ్ హీరోలకు బ్రహ్మరథం పడుతున్న వారు మాత్రమే కాదు అటు ట్రోల్స్ తో విమర్శలు గుప్పిస్తున్న వారు కూడా బాలీవుడ్ లో ఉన్నారు అని అర్థమవుతుంది.
ఇక ఈ విషయం పక్కన పెడితే పుష్ప 2 తో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతుండగా.ఇక వరుస భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఇక రాజమౌళి సినిమాతో మరోసారి బాలీవుడ్ రికార్డులను కొల్లగొట్టెందుకు రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.