సాధారణంగా హీరోయిన్స్ ఎవరైనా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే తమ కెరీర్ సెట్ అవుతుందని అనుకుంటారు.అది సహజమే కాని అందరికీ అవకాశాలు లభించడం కష్టమనే చెప్పొచ్చు.
అయితే, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లో హీరోయిన్స్గా చేసినా కొందరు హీరోయిన్స్కు ఆ తర్వాత కాలంలో పెద్దగా సినీ ఆఫర్స్ రాలేదు.వారు ఎవరెవరంటే.
మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటించి తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు.కాని కొందరు మాత్రం ఆ తర్వాత కాలంలో పెద్దగా రాణించలేకపోయారు.
‘టక్కరి దొంగ’ మూవీతో బాలీవుడ్ నటి బిపాసా బసు, లీసారె టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్స్గా పరిచయమయ్యారు.అయితే, వారికి ఆ తర్వాత తెలుగు సినిమాలో ఆఫర్స్ రాలేదు.
దాంతో వారు మళ్లీ తెరమీద కనబడకుండా పోయారు.స్టైలిష్ సినిమా ‘అతిథి’లో మహేశ్ సరసన అమృతారావు హీరోయిన్గా నటించింది.
అయితే, ఈమెకు కూడా ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు.దాంతో అమృతరావు బాలీవుడ్పైనే దృష్టి సారించింది.
మహేశ్ నటించిన ‘1.నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటించింది.ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఇకపోతే ఈ భామకు ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా ఆఫర్స్ రాలేదు.అయితే, బాలీవుడ్లో మాత్రం ఈ భామ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్నది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రంలో హీరోయిన్గా కృతిసనన్ నటిస్తోంది.మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేశ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.ఈ చిత్రం సక్సెస్ కాగా ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది కియారా.
అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.అలా ఈ భామకు కూడా తెలుగు సినీ ఆఫర్స్ నెక్స్ట్ లైనప్లో కలిసి రాలేదు.
కాగా జీనియస్ డైరెక్టర్ శంకర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ – దిల్ రాజు కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్లో హీరోయిన్గా సెలక్ట్ అయింది కియారా అద్వాని.ఈ చిత్రం తర్వాత అయినా కియారా తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి మరి.