వేళకు తినకపోవడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు అందికపోవడం వంటి రకరకాల కారణాల వల్ల ఆకలి ఒక్కోసారి విపరీతంగా వేస్తుంటుంది.ఈ సమయంలో ఇంట్లో తినడానికి ఏముంటే అవి కడుపులో పడేస్తుంటారు.
అవి ఆరోగ్యానికి మంచివా.? కాదా.? అని ఆలోచించరు.అయితే వాస్తవానికి ఆకలి విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు.
ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కూరగాయ ముక్కలు.
వీటిని చాలా మంది తింటుంటారు.ఆరోగ్యానికి పచ్చి కూరగాయ ముక్కలు ఎంతో మేలు చేస్తాయి.
కూరగాయలను పచ్చిగా తినడం వల్ల.వాటిలో ఉండే పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.
కానీ, ఆకలి విపరీతంగా వేస్తున్నప్పుడు పచ్చి కారగాయ ముక్కలు తినకపోవడం ఎంతో ఉత్తమం.ఆకలి మీద వీటిని తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి.
మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశాం కూడా ఉంటుంది.
ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు కూల్డ్రింక్స్, ప్రోటీన్ షేక్స్, పెరుగు, కాఫీ, టీ వంటి వాటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి, ఆయా ఆహారాలను తీవ్రమైన ఆకలి వేస్తున్నప్పుడు ఎవైడ్ చేయాలి.
అలాగే ఆకలి విపరీతంగా ఉన్నప్పుడు లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చిప్స్ జోలికి కూడా పోకూడదు.
ఎందుకంటే, చిప్స్లోని ఉప్పు జీర్ణక్రియకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది.దాంతో వివిధ రకాల జీర్ణ సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఆకలి తీవ్రంగా ఉన్నప్పుడు మాంసం, ద్రాక్ష- నిమ్మ- నారింజ లాంటి సిట్రస్ పండ్లు, షుగర్, షుగర్తో తయారు చేసిన స్వీట్లు, మసాలా ఫుడ్స్, టమాటాలు వంటి వాటిని తీసుకుంటే కడుపులో అసౌకర్యం ఏర్పడుతుంది.అందుకే ఆయా ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.