రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చు.. మమతా బెనర్జీ

ఒడిశా రైల్వేప్రమాద ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు.ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె దీని వెనుక కుట్రకోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

 There May Be A Conspiracy Behind The Train Accident.. Mamata Banerjee-TeluguStop.com

ఈ నేపథ్యంలో రైలు ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని మమత తెలిపారు.మూడు సార్లు రైల్వేమంత్రిగా పని చేశానన్న ఆమె రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు.బెంగాల్ తరపున బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఇందులో భాగంగా 70 అంబులెన్స్ లు, వైద్య సిబ్బందిని ఒడిశా తీసుకొచ్చినట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube