మాజీ మంత్రి మల్లారెడ్డి( Ex Minister Malla Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఐదారుగురు పోతే బీఆర్ఎస్ కు( BRS ) నష్టం లేదని చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్( KCR ) ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని విమర్శించారు.
నీళ్లు, కరెంట్ ఉన్నా ఇవ్వడం లేదన్న మల్లారెడ్డి రెండు జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు.తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ గా తీర్చిదిద్దారని వెల్లడించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.