సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జెడ్పీటీసీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణ, చంద్రకాంత్ ఇళ్లపై దాడి జరిగింది.
నిందితుల ఇళ్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.నిరసరకారుల దాడుల్లో ఇంటి అద్దాలతో పాటు కారు, ట్రాక్టర్లు ధ్వంసమైయ్యాయి.
నిన్న మార్నింగ్ వాక్ కు వెళ్లిన జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఆందోళనల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.