మోడీ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరిన పెద్దూరు యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: నరేంద్ర మోడీ పాలన పై నమ్మకంతో బండి సంజయ్( Bandi Sanjay ) నాయకత్వం పై నమ్మకంతో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బరకం లక్ష్మి నవీన్ యాదవ్ నేతృత్వంలో టిఆర్ఎస్ నుండి బిజెపిలోకి చేరిన 9వ వార్డు పెద్దూరు సిరిసిల్ల నాయకులు కొంపెల్లి రవీందర్, పత్తిరి సంతోష్, సంతోష్,ఈర్నాల రామ్ తేజ్, ఈర్నాల సంపత్,మోటమ్ మధు, కొండపల్లి సాయి, కడమంచి అజయ్,కడమంచి సంతోష్ లు బిజెపిలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానన్న ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అధికారం ఏ లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గర్రెపల్లి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి బరకం నవీన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, నాయకులు ఠాగూర్ రాజ్ సింగ్,ప్రధాన కార్యదర్శి కైలాష్ రెస్వాల్, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు తదితర నాయకులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News