రేషన్ డీలర్ల సమస్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రేషన్ డీలర్లతో మాట్లాడే తీరిక కేసీఆర్ కు లేదని బండి సంజయ్ మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు.
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలన్న బండి సంజయ్ వారికి ఇచ్చే కమిషన్ లో సగం కేంద్రమే చెల్లిస్తోందని తెలిపారు.ధాన్యం కొనుగోలులో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శలు చేశారు.