టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణంరాజు అంటున్న మంత్రి..!!

తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణం రాజు అని వైసీపీ మంత్రి తానేటి వనిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

హీరోయిజం చూపించడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి విపరీతమైన భాష మీడియా ముందు  ఉపయోగించారని, ఉన్మాదిగా వ్యవహరించడాని రఘురామ కృష్ణం రాజు పై మండిపడ్డారు.

ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా ప్రజాసమస్యలను తెలుసుకోకుండా పరిధులు దాటి ఘోరంగా వ్యవహరించారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.బండ బూతులతో వ్యంగ్యంగా కూడిన భాషతో.

మాట్లాడారని తెలిపారు.ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన ఒక్క లక్షణమైనా రఘురామకృష్ణంరాజుకి  లేదని దుయ్యబట్టారు.

ప్రజల దగ్గర మన్ననలు పొందాలి అంటే వారి కష్టాలు తెలుసుకొని వారి సమస్యలు తీర్చాలని, అటువంటివారే ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో ఎదుగుతారని తెలిపారు.కానీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని మీడియా ముందు.

Advertisement

వ్యంగ్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని తానేటి వనిత వ్యాఖ్యానించారు.ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా స్పందించారు.

కరోనా కష్టకాలంలో సీఎం జగన్ ప్రజల కోసం కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేస్తున్న రఘురామకృష్ణం రాజును శిక్షించాల్సిందే అని పేర్కొన్నారు.చంద్రబాబుకి తొత్తుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని ఆరోపించారు.

మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడారని.రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్న ఈ కుట్రదారుని.

శిక్షించాల్సిందే.జైలుకు పంపాల్సిందే అని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

  .

Advertisement

తాజా వార్తలు