సూర్యాపేట జిల్లా:బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై గడీల బానిస,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండెపంగు రమేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన కోదాడలో ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల ఒక సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆర్.
ఎస్.ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల బహుజనుల పక్షాన నిలబడి, బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ,క్షేత్రస్థాయిలో బహుజనం పడుతున్న బాధలను చూస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ,వారిని బహుజన రాజ్యంలో భాగస్వాములుగా చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు.అలాంటి వ్యక్తిపై ఓ బహుజన బిడ్డవై ఉండి,దొరల గడీల దగ్గర ఊడిగం చేస్తూ చెంచాగిరి చేసే నువ్వు అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.
ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకుండా అలాగే మొరిగితే తెలంగాణ రాష్ట్రంలోని బహుజనులు చూస్తూ ఊరుకోరని,నిన్ను ఎక్కడా తిరగక కుండా చేస్తారని ఖబర్దార్ అంటూ మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇద్దరు ఎంపీలు కూడా లేనప్పుడు 36 మంది ఎంపీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.
కేసీఆర్,కేటీఆర్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి,ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బహుజన ప్రజాక్షేత్రంలో నీ బట్టలిప్పి తన్ని తరిమే రోజు దగ్గర పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో నిత్యం దళితులపై ఏదో ఒక చోట దాడులు జరుగుతుంటే ప్రశ్నించలేని సన్నాసి నువ్వని,అభంగ పట్టణంలో దళితులను ముక్కు నేలకు రాసినప్పుడు గానీ,కేటీఆర్ ఇసుక లారీల దందాలో అడ్డుపడుతున్నారని నేరెళ్లలోని దళితులను పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలకు గురి చేసినప్పుడు గానీ,దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేసినప్పుడు గానీ,తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని తాను చస్తానని బెదిరించి చావకుండా ఈరోజు 1300 మంది అమరవీరులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనప్పుడు ప్రశ్నించలేని కట్టుబానిస నువ్వు, బహుజనులకు రాజ్యాధికారం కోసం పరితపిస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడే మొగోడివా అని నిప్పులు చెరిగారు.తక్షణమే డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కి సాష్టాంగ పడి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయకపోతే బహుజన ప్రజాక్షేత్రంలో నీకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు.