ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.ఈ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి.
మామిడి రాలింది.అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.