ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల లో వెలసియున్న శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారు గత రెండు సంవత్స రాల నుంచి కరోనా కారణంగా పండుగ నిర్వహించకపోవడంతో ప్రతియేటా జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఈ ఏడాది జరగడంతో భక్తులు సంతోషిస్తూ తమ ఆరాధ్య దైవమైన మాడుగుల మోదకొండమ్మ వారిని దర్శించుకోడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు అంతే కాకుండా ప్రతి ఏటా ఈ మోద కొండమ్మ అమ్మవారి పండుగకు దేశ నలుమూలలో ఎక్కడున్నా తప్పని సరిగా ఈ పండుగకు విచ్చేసి అమ్మ వారిని దర్శించుకుని కుటుంబంతో సహా ఊరంతా ఘటాలతో ఊరెగిస్తారు భక్తుల సందర్శనార్ధం ఆలయ సమీపం లో ప్రత్యేక ఏర్పాట్లు ఆలయకమిటీ వారు చేశారు శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తూ పండుగలో ఎటువంటి గొడవలు జరగకుండా భారీగా పోలీస్ బంధోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఉత్స వానికి పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు,వ్యాపారావేత్తలు,వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.







