మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రిన్స్ మహేష్ బాబు ది హిట్ కాంబినేషన్ .గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా , ఖలేజా మూవీస్ ప్రేక్షకులను బాగా అలరించాయి .2020 లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ అల వైకుంఠపురములో .ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ అల్లు అర్జున్ ఇంటెన్స్ యాక్టింగ్ , కామెడీ సీన్స్ , త్రివిక్రమ్ డైలాగ్స్ , తమన్ మ్యూజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అందుకుంది .ఇక ఈ సినిమా తో స్టైలిష్ స్టార్ హీరో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు .
ఇక అసలు విషయానికి వస్తే .లాస్ట్ ఇయర్ 2022 లో మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ సర్కారు వారి పాట .ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ , మహేష్ బాబు మ్యానరిజమ్స్ , ఫైట్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక మహేష్ బాబు సర్కారు వారు పాట మూవీ సక్సెస్ తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో మూవీ ఎనౌన్సమెంట్ చేసారు .ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .ఈ మూవీ కి సంబంధించి మూవీ ఎనౌన్సమెంట్ వీడియో తప్పితే ,మరే అప్ డేట్ బయటకు రాలేదు .ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది ఇక ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది .
ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజులు నుండి చాలా శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ మూవీని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ కాప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది .ఇక ఈ అప్ డేట్ బయటకు రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను సెలెక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.ఈస్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించేందుకు సిద్ధమయ్యారట చిత్రయూనిట్.మరి నిజంగా మహేష్ బాబు సరసన స్పెషల్ సాంగ్ లో మలైకా అరోరా నటిస్తుందన్న విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలసిందే …