అమరావతి: అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత.2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్. వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్గోపాల్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఇతర నేతల్ని అడ్డుకున్న పోలీసులు.
పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట.తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసిన పోలీసులు.పలువురు నేతలకు గాయాలు.తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు.







