కుప్పం చంద్రబాబు పర్యటనలో టెన్షన్ వాతావరణం..!!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులపాటు పర్యటిస్తూ ఉన్నారు.మొదటిరోజు నిన్న కుప్పం పర్యటనలో భాగంగా.

రామకుప్పం వద్ద వైసీపీ జెండాలు ఉండటంతో.టీడీపీ కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర గర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసిపి పార్టీకి చెందిన కార్యకర్తపై దాడికి కూడా పాల్పడటం జరిగింది.ఈ పరిణామంతో నేడు కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వైసీపీ నాయకుడు ఇంటిపై దాడికి నిరసనగా చంద్రబాబు పర్యటన అడ్డుకుంటామని వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు.దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలంతా కుప్పం వైసీపీ పార్టీ ఆఫీస్ కి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

వారికి పోటీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకుంటున్నారు.దీంతో కుప్పం నియోజకవర్గం టెన్షన్ వాతావరణం నెలకోనటంతో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది.

ఈ పరిణామంతో ముందు జాగ్రత్తగా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు ఆగిపోగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు