తెలుగులో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన “మా అన్నయ్య” చిత్రంలో “మైనా ఏమైనావే మన్మధ మాసం” పాటలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హిందీ నటి “దీప్తి భట్నాగర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు మొదటగా 1996వ సంవత్సరంలో ప్రముఖ విలక్షణ దర్శకుడు కె.
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన “పెళ్లి సందడి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈ అమ్మడికి ఎక్కువగా హిందీ, తమిళం, ఇతర భాషలలోనే సినిమా అవకాశాలు రావడంతో తెలుగు సినీ పరిశ్రమపై పెద్దగా దృష్టి సారించ లేకపోయింది.
అయితే ఈ మధ్యకాలంలో దీప్తి భట్నాగర్ సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలను దీప్తి భట్నాగర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.
అయితే నటన పరంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నప్పటికీ దీప్తి భట్నాగర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ని మెయింటెన్ చేస్తూ చాలా యంగ్ గా కనిపిస్తోంది.ప్రస్తుతం దీప్తి భట్నాగర్ కి దాదాపుగా 53 ఏళ్లు వయస్సు ఉన్నప్పటికీ తన వన్నె తరగని అందంతో వయసుని దాచేస్తుంది.
ఈ విషయం ఇలా ఉండగా దీప్తి భట్నాగర్ వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో రణదీప్ ఆర్య అనే ఓ ప్రముఖ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే పెళ్లి అయిన తర్వాత దీప్తి భట్నాగర్ సినిమాలలో నటించడం పూర్తిగా మానేసింది.దాంతో తన స్వస్థలం అయినటువంటి ఉత్తరప్రదేశ్లోని మీరట్ పరిసర ప్రాంతంలో ఓ హ్యాండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఫ్యాక్టరీని స్థాపించి ప్రస్తుతం వ్యాపారాల్లో బాగానే రాణిస్తోంది.