అమెరికాలో తెలుగు బాష రోజు రోజుకి ప్రాధాన్యతని సంతరించుకుంటోంది.గడిచిన ఎనిమిదేళ్ళలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని తాజాగా జరిగిన యూఎస్ సెన్సెస్ బ్యూరో సర్వేలో తేలింది.అమెరికన్ కమ్యూనిటీ సర్వే నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 6.7 కోట్ల మంది తమ బాషని మాత్రమే కాకుండా మరొక బాషని సైతం మాట్లాడుతున్నట్లుగా ఈ సంస్థ గుర్తించింది.
భారతీయులలో ముఖ్యంగా హిందీ బాషని అత్యధికంగా మాట్లాడుతున్నారని, ఆ తరువాత గుజరాతీ బాషని మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.మూడో స్థానంలో తెలుగు బాష నిలిచింది.జూలై 1 2018 నాటికి సుమారు 8.7 లక్షల మంది భారతీయులు హిందీ మాట్లాడుతున్నారని గుర్తించారు.గతంలో కంటే కూడా హిందీ మాట్లాడే వారి సంఖ్య పెరిగిందని సంస్థ తెలిపింది.
2010 లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2.23 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య అంటే 2018 కి 4 లక్షలకి చేరిందని సర్వే తెలిపింది.అంతేకాదు రోజు రోజుకి తెలుగు మాట్లాడాలని అనుకునే వారు, తెలుగు సంస్కృతీ , సాంప్రదాయాల పట్ల ఆకర్షితులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని సర్వే తెలిపింది.
తెలుగు తరువాత స్థానంలో బెంగాలి, తమిళ బాషలు మాట్లాడే వారి సంఖ్య పెరుగుతోందట.