బీజేపీపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.
దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.మానవత్వం లేకుండా సోనియా గాంధీని వేధించారని మండిపడ్డారు.
అదేవిధంగా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న రేవంత్ రెడ్డి.బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా ఈడీని బీజేపీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు.పాదయాత్ర జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారని, ఈడీ నోటీసుల పేరుతో ఢిల్లీకి పిలుస్తున్నారని విమర్శించారు.