మరికాసేపట్లో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం !

కరోనా కారణంగా తెలంగాణ గత సెషన్ అసెంబ్లీ సమావేశాలు మధ్యలోనే ముగిశాయి.తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది.

 Ts Assembly, Telangana, Cm Kcr,ktr, Harishrao,ghmc-TeluguStop.com

ఈ రోజు ఉదయం 11:30 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది.నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

నాలా చట్టానికి సవరణ, రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు, జీహెచ్ఎంసీ చట్టం – 1955, సవరణ బిల్లులపై చర్చించి అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.కరోనా మహమ్మారి కారణంగా అసెంబ్లీలో కరోనా నియమాలని పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ సమావేశంలో జీహెచ్ ‌ఎంసీ సహా 4 చట్టసవరణ ముసాయిదా బిల్లులపై చర్చ జరుగనుంది.అలాగే వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగం, సీఆర్పీసీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులపైనా చర్చ చేపట్టనున్నారు.

ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బిల్లులపై చర్చ జరుగనుంది.

ఈ రోజు శాసనసభ, బుధవారం మండలి సమావేశం కానున్నాయి.

దీనికి తగ్గట్టుగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్‌ చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.అందుకనుగుణంగా సీటింగ్‌ను ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు.

కరోనా దృష్ట్యా గతంలో సభలో సభ్యుల మధ్య భౌతికదూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్‌ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.అసెంబ్లీ ప్రాంగణం, సభ లోపల పూర్థిస్థాయిలో శానిటైజేషన్‌ చేయించాలని మండలి కార్యదర్శిని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube