మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ను హైదరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.మత పరమైన వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని బీజేపీ మార్చుకోనున్నట్లు తెలుస్తుంది.బిజెపి అతన్ని బెయిల్పై విడుదల చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
పార్టీ జాతీయ నాయకత్వం సూచనలను అనుసరించి మొదట మౌనంగా ఉన్న పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు, హిందూ సంఘాల ఒత్తిడి కారణంగా రాజా సింగ్కు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించారు.
ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఢిల్లీ పెద్దలు.
షోకాజ్ నోటీసుకు నెల రోజులు గడిచినా రాజసింగ్ స్పందించక పోయినా పార్టీ నుంచి బహిష్కరించడం లేదు.హిందు వర్గాల ఒత్తిడితో వారు కూడా మెతక వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా పీడీ యాక్ట్ కింద ఒకసారి అరెస్ట్ చేస్తే కనీసం మూడు నెలల వరకు బెయిల్ లభించదు.అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ వచ్చేలా రాజా సింగ్ కేసును కోర్టులో వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులతో పాటు సీనియర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిస్తుంది.
రాజా సింగ్ను పిడి చట్టం కింద అరెస్టు చేయడం బిజెపి కార్యకర్తలు, అతని అనుచరుల నుండి మాత్రమే కాకుండా, విహెచ్పి, భజరంగ్ దళ్, ఇతర హిందూ సంస్థల నుండి కూడా నిరసనలకు దారితీసింది, రాజసింగ్ విడుదలకు ప్రయత్నాలు చేయాలని పార్టీపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు.రాజా సింగ్ అరెస్టును హిందువులపై దాడిగా అభివర్ణిస్తున్నారు.