వావి వరసలు మరచి చెల్లెలి పైనే రేప్, గట్టి ఝలక్ ఇచ్చిన న్యాయస్థానం

వరుసకు చెల్లెలు అయ్యే బాలికను అపహరించి ఆ తరువాత అత్యాచారానికి పాల్పడిన యువకుడికి తమిళనాడు న్యాయస్థానం గట్టి ఝలక్ ఇచ్చింది.

వావి వరుసలు మరచి చెల్లెలు అయ్యే బాలికను కిడ్నాప్ చేసి ఆ తరువాత ఆ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు 19 ఏళ్ల కామాంధుడు.

ఈ ఘటనకు సంబందించిన కేసును విచారించిన కోర్టు ఆ యువకుడికి 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(19) తనకు చెల్లెలి వరుసయ్యే బాలిక(16)పై కన్నేశాడు.2018, మే 21వ తేదీన ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో బాధితురాలు వదిలేయాలని ఎంత వేడుకున్నప్పటికీ కనికరించకుండా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనితో ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోవడం తో ఆమెను అక్కడే వదిలేసి ఆ యువకుడు పారిపోయాడు.అనంతరం ఆ ఘటన నుంచి తేరుకున్న బాధితురాలు ఇంటికి వెళ్లి విషయం తల్లి దండ్రులకు చెప్పడం తో పోలీసులకు ఫిర్యాదు చేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు అతడే నేరం చేసినట్లు గుర్తించారు.ఈ క్రమంలో దిండుక్కల్ మహిళా కోర్టు కేసును విచారించిన అనంతరం నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

కిడ్నాప్ చేసినందుకు ఏడేళ్లు, అత్యాచారానికి పదేళ్లు.మొత్తం 17ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.అంతేకాకుండా నిందితుడికి రూ.5వేల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు