ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలయ్యింది.మూడు వన్డేల సీరిస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో భారత్ పై కివీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడిపోయిన ఇండియా బ్యాటింగ్ కి దిగి నిర్ణయిత 50 ఓవర్లలో 306 పరుగుల భారీ స్కోర్ చేయడం జరిగింది.ఇండియా టీంలో కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించగా చివరిలో సంజు శాంసన్, వాషింగ్టన్ చెలరేగి బ్యాటింగ్ చేశారు.
ఇండియా 50 ఓవర్స్ కి 306 రన్స్ చేయడం జరిగింది.అయిన కానీ ఇంతటి భారి టార్గెట్ ని కివీస్ 17 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది. కివీస్ టీంలో లాధమ్(145*)… సెంచరీతో చెలరేగి ఆడాడు.విలియమ్సన్(94*) కూడా హాఫ్ సెంచరి చేశాడు.88 రన్స్ దగ్గర మూడో వికెట్ పడ్డ.తర్వాత వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడి …మరో వికెట్ పడకుండా జట్టు గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
దీంతో టీమ్ ఇండియా ఓటమిపాలయ్యింది.మరోసారి ఇండియా టీంకి బౌలింగ్ మైనస్ అని ఈ మ్యాచ్ నిరూపించింది.