తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ..!!

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఇందులో భాగంగా పార్టీలు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

 Tdp To Fight Alone In Telangana..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ పోటీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు తెలిపారు.

ఇప్పటికే పోటీపై ప్రత్యేక కమిటీ వేశామన్న ఆయన ఎక్కడెక్కడ పోటీ చేయాలో కమిటీ ఫైనల్ చేస్తుందని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు.

అయితే గెలిచే స్థానాలపై దృష్టి సారించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube