ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించింది.ఈ మేరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ సభ్యులు వెల్లడించారు.

ఇవాళ్టి సమావేశాల నుంచి బయటకు వచ్చిన టీడీపీ సభ్యులు రేపటి నుంచి రెండు సభలకు వెళ్లమని స్పష్టం చేశారని సమాచారం.అసెంబ్లీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ ప్రారంభమైంది.

ఈ క్రమంలో వైసీపీ సభ్యులు మాట్లాడుతుండగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.అనంతరం సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు