సోషల్ మీడియాకు ఏదీ అతీతం కాదు.ఇందులో ఉండనిది అంటూ ఏదీ లేదు.
ఫన్నీ, ఎమోషనల్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని సోషల్ మీడియాలో ఉంటాయి.ఒక్క సోషల్ మీడియా ఉంటే చాలు ప్రపంచం లో ఏది జరుగుతున్న అది మన చేతిలోనే దర్శనం ఇస్తుంది.
అందుకే అందరు రోజురోజుకూ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు.
ఇక యువత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వీరు టెక్నాలజీ పెరిగిన తర్వాత మరింత చెడి పోతున్నారు.ఇక అమ్మాయిలు అబ్బాయిలకు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు.
విద్య, ఉద్యోగాలు అంటూ ముందు ఉంటున్నారు.అయితే కొంత మంది విద్యార్థినీలు తాము అబ్బాయిల కంటే తాగుడు విషయంలో కూడా తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.
తాజాగా స్కూల్ స్టూడెంట్స్ బస్సులో బీర్ తాగుతూ కనిపించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.తమిళ నాడు కు చెందిన విద్యార్థులు స్కూల్ బస్సులో బీర్ తాగుతూ కనిపించరు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తమిళనాడులో ఓ రేంజ్ లో వైరల్ అయ్యిన ఈ వీడియో జిల్లా విద్యాధికారి వరకు చేరుకుందిట.
దీంతో ఈ విద్యార్థినీలపై చర్య తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇది పాత వీడియో అని అందరు అనుకున్నారు.కానీ ఇది మంగళవారం జరిగిన వీడియో అని తెలుస్తుంది.
ఈ వీడియోలో ముగ్గురు నలుగురు విద్యార్థినీలు కలిసి బీర్ బాటిల్ ఓపెన్ చేసి మరీ తాగుతూ కనిపించారు.వీరంతా చెంగల్ పట్టు లోని ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలుస్తుంది.
అధికారులు వీరిపై ఎలాంటి చర్య చేపడతారో వేచి చూడాల్సిందే.







