మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నా ఎన్ని పాన్ ఇండియన్ సినిమాలు చేసిన ‘రంగస్థలం’( Rangasthalam ) చిత్రాన్ని మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.రామ్ చరణ్ కి వరుస ఫ్లాప్స్ వస్తున్న సమయంలో, రొటీన్ అయిపోతున్నాడు అని అభిమానులు సైతం అనుకుంటున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ ని నటుడిగా వేరే లెవెల్ లో నిల్చోబెట్టింది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ విలక్షణ నటుడిగా, తండ్రి మెగాస్టార్ ని మించిన తనయుడిగా అభిమానుల చేత అనిపించుకున్నాడు.ఈ సినిమాకి కి బలమైన ప్రయత్నం చేసి ఉంటే రామ్ చరణ్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కి ఉండేది.
కానీ నిర్మాతలెవ్వరూ కూడా ఆ ప్రయత్నం చెయ్యలేదు.ఫలితంగా రామ్ చరణ్ అద్భుతమైన నటన కేవలం తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, ఆయన అన్నయ్య గా నటించిన ఆది పినిశెట్టి కి( Adi Pinishetty ) కూడా అలాంటి పేరు వచ్చింది.ఈ పాత్ర ఆయన కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ని ఇచ్చింది.సరైనోడు చిత్రం లో విలనిజం ని ఒక రేంజ్ లో పండించిన ఆది పినిశెట్టి నుండి ఇంత పాజిటివ్ రోల్ ఎవ్వరూ ఊహించలేకపోయారు.అయితే ఈ రోల్ ని తొలుత ఆదిపినిశెట్టి తో చెయ్యాలని అనుకోలేదట.
ప్రముఖ తమిళ హీరో ఆర్య తో( Hero Arya ) చేయించాలని అనుకున్నారట.కానీ ఆ సమయానికి ఆర్య డేట్స్ ఖాళీగా లేకపోవడం తో చివరికి ఆదిపినిశెట్టి తో చేసారు.
ఎలా చేస్తాడో ఏమో అనుకున్నారు కానీ, రామ్ చరణ్ తో పోటీపడి మరీ నటించాడనే చెప్పాలి.ఈ సినిమా విడుదల తర్వాత అద్భుతమైన రోల్ ని మిస్ అయ్యినందుకు ఆర్య చాలా ఫీల్ అయ్యాడట.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’( Game Changer ) అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది కానీ, కొన్ని ప్రతికూల పరిస్థితిలు ఏర్పడడం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ప్రస్తుతానికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెల లోపు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.