టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో నారా లోకేశ్ ను అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య కలిశారు.
పాదయాత్రలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేశ్ కు డీఎస్పీ సూచించారు.దీనిపై స్పందించిన నారా లోకేశ్ 67 రోజుల పాటు పాదయాత్రలో ఎక్కడా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
జగన్ ప్రభుత్వం అవినీతిని కచ్చితంగా ఎండగడతానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే డీఎస్పీ నోటీసును తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు.
దీంతో పాదయాత్ర ఆర్గనైజర్స్ కు డీఎస్పీ నోటీసులు అందజేశారు.