విశాఖ జిల్లాలో బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.ఈ విషాద ఘటన పెందుర్తి ఎస్ఆర్ పురంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందని బాలుడు తేజ నిన్న కనిపించకుండా పోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఓ షెడ్ వద్ద బాలుడు మృతదేహాన్ని గుర్తించారు.
అయితే బాలుడి శరీరంపై గాట్లు ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.