హెచ్సీయూ ప్రొఫెసర్ రవిరంజన్పై సస్పెన్షన్ వేటు పడింది.ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.
ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ విద్యార్థులకు తెలిపారు.థాయ్ లాండ్ కు చెందిన ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ హత్యాచారయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
అక్కడి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలోనే బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి హెచ్ సీ యూ గేట్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ప్రొఫెసర్ ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకోగా.సస్పెండ్ చేస్తునట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు.
దీంతో విద్యార్థులు ధర్నాను విరమించారు.