ఏం పాపం చేశానంటున్న సురేఖావాణి కూతురు.. ఏమైందంటే..?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీల పిల్లలకు కూడా ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి, వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇవ్వకముందే సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

అలా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సురేఖవాణి కూతురు సుప్రీత ఒకరు.భవిష్యత్తులో సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సురేఖావాణి పదుల సంఖ్యలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి గుర్తింపును సంపాదించుకోగా సుప్రీత మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.సుప్రీతకు ఇష్టమైతే తను సినిమాల్లోకి వెళతానన్నా అభ్యంతరం లేదని సురేఖావాణి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సురేఖావాణి గురించి ఏవైనా ఫేక్ వార్తలు వైరల్ అయితే సుప్రీత ఆ వార్తల గురించి స్పందించి వివరణ ఇస్తున్నారు.

Advertisement

అయితే ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే సుప్రీత ఫాలోవర్ల సంఖ్య గత వారం రోజుల్లో భారీగా తగ్గింది.వారం రోజుల్లో 321 మంది సురేఖావాణి కూతురు ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కొత్తగా ఫాలో కాగా 422 మంది అన్ ఫాలో అయ్యారు.ఫాలో అయిన వాళ్లతో పోలిస్తే అన్ ఫాలో అయిన వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో "ఏం పాపం చేశాను ఫ్రెండ్స్" అంటూ సుప్రీత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం సుప్రీతకు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 3,47,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.సుప్రీత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఆమె ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

సుప్రీత ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఎందుకు తగ్గిందో తెలియాల్సి ఉంది.ఫాలోవర్లు తగ్గడం పట్ల ఆవేదన చెందిన సుప్రీత ఆ విషయాన్ని ఈ విధంగా వెల్లడించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు