సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత చేస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ‘‘గుంటూరు కారం”( Guntur Kaaram ).అతి త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మరో 15 రోజుల్లో మహేష్ నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అటు ఆడియెన్స్ తో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో గత కొద్దీ రోజుల నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.నిన్ననే ఈ సినిమా నుండి మూడవ సింగిల్ ను కూడా రిలీజ్ చేసారు.

”కుర్చీ మడత పెట్టి” అనే మాస్ నంబర్ ప్రోమో నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ మొదటి కటౌట్ ను ఏర్పాటు చేయగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కటౌట్ ఎక్కడ ఏర్పాటు చేసారంటే…

మహేష్ బాబు గుంటూరు కారం కు సంబంధించిన కటౌట్ ను రాజమండ్రి లోని అప్సర థియేటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాలో శ్రీలీల ( SreeLeela) , మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.







