టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) అందం చూసి ఆశ్చర్యపోని వారు దాదాపుగా ఉండరు.మహేష్ బాబు వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా మహేష్ ను డైరెక్ట్ గా చూసిన వాళ్లెవరూ ఆయన వయస్సును నమ్మరనే సంగతి తెలిసిందే.
అయితే మహేష్ బాబు తీసుకునే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది.తాజాగా మహేష్ బాబు తన బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ తను తీసుకునే బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రాత్రంతా నానబెట్టిన ఓట్స్( Soaked oats ) ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
కొన్ని మొలకెత్తిన గింజలను, విత్తనాలను( Sprouted grains , seeds ) ఆహారంలో భాగంగా తీసుకుంటానని ఇదే నా ఆహారం అని మహేష్ బాబు కామెంట్లు చేశారు.ల్యూక్ కౌంటినోని తన న్యూట్రీషియన్ అని అతని సలహాల ప్రకారం ఆహారం తీసుకుంటానని మహేష్ అంటున్నారు.
మహేష్ రోజురోజుకు యంగ్ గా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహేష్ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి అందంగా కనిపిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుండగా భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం వల్లే పూజా హెగ్డే ఈ సాంగ్ లో చేస్తున్నారని సమాచారం అందుతోంది.రాబోయే రోజుల్లో పూజా హెగ్డే కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 70 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.