సూపర్ స్టార్ కృష్ణ 340కు పైగా సినిమాలలో నటించగా ఆయనతో సినిమాలను నిర్మించి నష్టపోయిన నిర్మాతలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.సినిమా ఫ్లాపైతే రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా కృష్ణ నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.2000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ తన సినీ కెరీర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే అంటే నమ్మశక్యం కాదు.
రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడం ద్వారా నిర్మాతపై భారం తగ్గుతుందని కృష్ణ భావించేవారు.
కృష్ణ మరణం తర్వాత ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.కృష్ణ గారిపై అభిమానంతో కొంతమంది అరకోటికి అటూఇటుగా రెమ్యునరేషన్ ఇచ్చినా నిర్మాతల నుంచి ఆయన అడిగి తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ పాతిక లక్షల రూపాయలు అని నట్టి కుమార్ అన్నారు.
హీరోగా సినిమాలలో నటించిన సమయంలో ఆయన తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమేనని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
కృష్ణ , విజయనిర్మల మధ్య మంచి అటాచ్ మెంట్ ఉండేదని నట్టి కుమార్ పేర్కొన్నారు.విజయనిర్మల మరణం అనంతరం ఆయన ఒంటరి అయ్యారని కొడుకు రమేష్ మరణం ఆయనను మరింత బాధ పెట్టిందని నట్టి కుమార్ వెల్లడించారు.
విజయనిర్మల, రమేష్ బాబు జీవించి ఉంటే కృష్ణ మరికొన్ని సంవత్సరాల పాటు జీవనం సాగించేవారని ఆయన పేర్కొన్నారు.ఏసు ప్రభువు రోల్ లో నటించాలని కృష్ణగారికి కోరిక ఉండగా ఒక సినిమాలో ఆ రోల్ లో నటించడం ద్వారా ఆ కోరికను నెరవేర్చుకున్నారని ఆయన వెల్లడించారు.కృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారని రోజుకు 18 గంటల పాటు కృష్ణ పని చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.